Anantapur

Oct 12 2023, 17:53

జగనన్న కాలనీలలో ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతల వివాదంపై స్పందించిన జడ్పిటిసి నీలం భాస్కర్
విమర్శించడమే పనిగా పెట్టుకుని విమర్శిస్తున్న ప్రపంచ మేధావులారా ఓక్కోక్క ఇంకుడు గుంతకు 2000 రూపాయలు లాభం ఉంది అని అంటున్నారు అలాంటప్పుడు ఆ కాంటాక్ట్ వర్క్ మొత్తం మీకే ఇస్తాము మీరే చేయండి. నిజంగా ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ సరి చేయండి ఇక్కడ ఇలా కాకుండా ఇంకో రకంగా చేయండి అని చెప్పడం గొప్ప. మొత్తం ఈ పథకమే తప్పు అనే విధంగా మాట్లాడుతున్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఇంకుడు గుంతల కోసం ఉపయోగించే రింగులలో నాసిరకం మేలురకమని ఉండవు రింగులు తయారు చేసే వారిని బట్టి దాని మన్నిక ఉంటుంది. వందలలో పనులు జరిగేటప్పుడు ఎక్కడో ఒకచోట తప్పు జరగడం సహజం కానీ మొత్తం పని అంతా తప్పు అనడం అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అత్త సొమ్ము అల్లుడికి దానం చేసినట్టు అంటున్నారు ఇది మీరు మద్దతుగా ఉన్న గత ప్రభుత్వంలో వారికి వర్తిస్తుంది కానీ ఈ ప్రభుత్వంలో పని చేసే మాకు కాదు. నేను మేధావి అనుకోవడం తప్పుకాదు కానీ అంతా నాకే తెలుసు అనుకోవడంలోనే మనమంటే ఏమిటో తెలుస్తుంది.

Anantapur

Oct 12 2023, 17:46

జగనన్నా మీ పేరుతో ఉన్న కాలనీల్లో నడి రోడ్డు మీద ఇంకుడు గుంతల బాగోతం కళ్ళారా చూడన్నా సిపిఎం విజ్ఞప్తి
జగనన్నా మీ పేరుతో ఉన్న కాలనీల్లో నడి రోడ్డు మీద ఇంకుడు గుంతల బాగోతం కళ్ళారా చూడన్నా సిపిఎం విజ్ఞప్తి ఈ రోజు సిపిఎం బుక్కరాయసముద్రం మండల కమిటీ విలేఖరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ. నల్లప్ప, మండల కార్యదర్శి ఆర్. కుల్లాయప్ప పత్రికా ప్రకటన విడుదల చేసారు.* *సోప్ పిట్స్ (ఇంకుడు గుంతలు) ఎవరి లబ్ధికోసం సిపిఎం సూటి ప్రశ్న. ఈ సందర్భంగా నాయకుల మాట్లాడుతూ 2018-19 లో ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతల నిర్మాణ పనులను వ్యక్తి గతంగా ఇళ్ల దగ్గర తమ ఖాళీ జాగాలో ఏర్పాటు చేసుకొని వర్షం నీరు, ఇంట్లో ని స్నానం, బట్టలు. నీళ్లు భూగర్భంలో ఇంకెందుకు ఉద్దేశించింది. ఉపాధి పనుల్లో ఎక్కడా కాంట్రాక్టర్ బృందం చేయాలనే నిబంధన లేదు.* *సంబంధిత అధికారుల పర్యవేక్షణలో పనులు జరిగే విధంగా లబ్దిదారుల ద్వారా చేయించాల్సిన పనులు* *అత్త సొమ్లుకు అల్లుల్లు ఎదురు చూపు :-* *జగనన్న కాలనీల్లో కేంద్రం నుండి రూ.1.5 లక్షలు నిధులతో ఇల్లు నిర్మిస్తూ, కేంద్రం ఇచ్చే ఉపాధి నిధులను లబ్దిదారులకు ఇవాల్సిన 30 వేల రూపాయల ల్లో మరుగుదొడ్డి నిర్మాణానికి (23 వేలు) పోగా మిగిలిన 7 వేల రూపాయల్లో ఇంకుడు గుంత కోసం ఇవ్వాలని ఉంది. ఇక్కడే అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై లబ్దిదారుల ప్రమేయం లేకుండానే నడి రోడ్డు మీద ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ప్రజాధనం వృధా అవుతుంది, లబ్దిదారులు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న వారికి ఈ నిధులను నేరుగా అర్హతను బట్టి ఇవ్వవచ్చు. అందుకు వారు గుంతలు సిమెంట్ రింగులు వేసినట్లు తీసుకున్న చిత్రాల ద్వారా అర్హతను గుర్తించి ఇవ్వవచ్చు. జగనన్న కాలనీల్లో రోడ్లు సరిగాలేవు. డ్రైనేజీ కాలువలు వేయవచ్చు. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి తప్ప మరొకటి కాదని సిపిఎం మండల కమిటీ భావిస్తున్నది.* *నడి రోడ్లపై ఇంకుడు గుంతాల బుద్ది ఉన్న ఏ ఇంజనీరు చేయించరు.:-* *కాలనీల్లో గృహ నిర్మాణ శాఖ నుండి విధులు నిర్వర్తించే అధికారులు లబ్దిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ అధికారులకు నడిరోడ్ల మీద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరుగుతాయని తెలియవా? తెలిసిన మేము కాదు కాపురాలు ఉండేది జనం కదా ఎవరు నాశనం అయితే నాకేమీ మా జీతాలు, మాకు టిఫిన్లు, ఇతర రూపాల్లో ఇస్తే ఊడిగం చేస్తుంటారా అని ప్రజలు అనుకుంటున్నారు.* *నడి రోడ్డు పై ఇంకుడు గుంతలు కొత్త తరహా నిర్మాణాలకు తెర లేపిన ఓ ఇంజనీరు గిన్నిస్ రికార్డ్ జాబితాకు ఎంపిక చేయాలి.* *అధికార పార్టీ నాయకుల అబ్ది కోసం లబ్దిదారులపై ఒత్తిడి చేస్తున్న సిబ్బంది :-* *ఇంకుడు గుంతల నిర్మాణం గురించి కొద్ది మంది లబ్దిదారులు ఇప్పటికీ నిర్మాణాలు పూర్తి అయ్యి, ఖాళీ జాగాలు లేని వారు మీ కొంప ముందు రోడ్డులో వేసుకోవాలి. ప్రతి నాకొడుకు కు చెప్పాలి, మాకు వీకే పనులు లేవా అనే విధంగా మరి బరితెగించి లబ్దిదారుల మీదకు దుర్భాషలు మాట్లాడే ధైర్యం ఎవరిచ్చారు. మేము పని చేసేది ప్రజలకు కాదు కాంట్రాక్టర్ల కు అన్న చందంగా పనితీరు కనబడుతున్నదని లబ్దిదారులను కదిలిస్తే తెలుస్తుంది. స్వయాన సిపిఎం నాయకులు ఈ విషయమై సంబంధిత అధికారిని వివరణ అడిగితే ఇది అంతా వృదా కొత్తగా రోడ్లు, డ్రైనేజీ కాలువలు వేస్తే తొలగించాల్సిందే నేను చెప్పలేను అని నర్మగర్భంగా చెప్పారు.* *ఇంకుడు గుంతల వల్ల ఎవరికి లాభం :-* *ఇంకుడు గుంతల అవినీతి బాగోతం బలే గమ్మత్తు జగనన్న కాలనీల్లో పట్టపగలు దొంగలు పడ్డారు. నిలువు దోపిడీలాభం కోసం తప్ప ప్రజల ప్రయోజనం శూన్యం. జగనన్న కాలనీల్లో 1200 ఇళ్లకు ఇంకుడు గుంతల నిర్మాణం కు 66 లక్షల పనులు మంజూరు ఉపాధి హామీ పథకం లో కాంట్రాక్టర్ల హావా. నిబంధనలు విరుద్ధంగా లబ్దిదారులకు కాకుండా కాంట్రాక్టర్ కు లబ్ది. ఇంత చేసిన ఒక్కటి ఉపయోగ పడదు, డ్రైనేజీ కాలువలు, సిమెంట్ రోడ్లు వస్తే ఇంకుడు గుంతలు తొలగించాల్సినదే.* *లాభాలు కోసం ఆరాటం :-* *సిపిఎం మండల కమిటి క్షేత్ర స్థాయిలో లబ్దిదారుల నుండి సేకరించిన వివరాలు ముడి సరుకు ధరలు, ఇతర అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఒక్కొక్క ఇంకుడు గుంతకు మంజూరు అయినది రూ. 500/- లబ్ధిదారుకు చేతికి రూ. 500/- కాంట్రాక్టర్ జేబుల్లోకి రూ.5000/- ఎలా వెళ్తుందో చూద్దాం.* *కాంట్రాక్టర్ పెట్టే ఖర్చు మూడు రంగులకు, మూతకు రూ.1500/-, జెసి బి ఖర్చు గుంత కు 200/- సిమెంట్, కూలి ఖర్చు రూ. 1300/- , (ఇవి లబ్ధిదారుని నెత్తిన పెట్టుతున్నారు) మొత్తం ఖర్చు రూ. 3000/-లోపే, ఇంకా ఖర్చు కొంత తగ్గవచ్చు, లాభం ఒక్కొక్కదానికీ అక్షరాల రూ.2000/-, బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఉన్న జగనన్న అన్ని లే అవుట్ లలో దాదాపు 1200లకు పైగా మంజూరు అయ్యాయి.* *60% పైగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఇంకుడు గుంతలు (720) ఏర్పాటు చేసుకుంటే కాంట్రాక్ట్ బృందం పెట్టుబడి 21.6 లక్షలు లాభం 14.4 లక్షలు* *డబ్బులు వృదా తప్ప ప్రయోజనం శూన్యం :-* *ఇంత చేసినా ఇంకుడు గుంతలు వృధా గా పూడ్చడానికి తప్ప ఎందుకూ పనికి రావు. నిపుణులతో విచారణ చేస్తే వాస్తవాలు బయటికి వాస్తయి. ఇన్ని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే వచ్చే ప్రయోజనం శూన్యం, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు వేస్తే వీటిని తొలగించాలి. సిమెంట్ రోడ్లు వేస్తే ఇంకుడు గుంతలు తొలగించాలి. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినవి అన్ని రోడ్ల మీద నే ట్రాక్టర్లు, ఆటోలు ఇరుక్కుంటే దిక్కెవరు..* *సిపిఎం మండల కమిటీ గుర్తించిన అంశాలు:-* *1. నడి రోడ్డులో ఇరువైపులా*ఇంకుడు గుంతలు హౌసింగ్ ఏ ఇ కనుసన్నల్లో ఏర్పాటు చేస్తున్నది వాస్తవం కాదా ?* *2. నాసిరకం సిమెంట్ రింగులు, మూరెడు పైపు, పగిలిన రింగులు, మూతలు ఇస్తున్న మాట వాస్తవం కాదా ?* *3. కన్ను మూస్తే రెడు, కన్ను తెరిస్తే రెండు రంగులు లబ్ధిదారులు అడిగితే మూడు చూడక పోతే రెండే రింగులు* *4. పని చేశామని మమ అనిపిస్తున్న కాంట్రాక్టర్ బృందం.* *5. దూదరెకుల మదారమ్మ ఇంటి ముందు వేసిన మూడు రోజులకే ట్రాక్టర్ వెళ్ళడం తో నడి రోడ్డు లో వేసినవి విరిగిపోయిన రంగులు వాస్తవం కాదా ?* *6. కాసులు కురిపిస్తున్న ఇంకుడు గుంతలు లబ్ధిదారుల ప్రమేయం లేకుండా బిల్లు ల కోసం ఒత్తిడి* *7. ఈపాటికే ఇళ్ళల్లో చేరిన వారికి ఇంటి ముందు రోడ్డు మీదే రంగులు ఏర్పాటు, రింగులు వేయించుకోక పోతే బిల్లులు రావని బెదిరింపు* *8. ఒక లబ్దిదారు తాను స్వంతంగా నిర్మించుకున్న గుంతలను ధ్వంసం చేసి కాంట్రాక్టర్ బృందం కొత్తగా తవ్విన తీరు. నాసిరకం, పగిలిన రింగులు లబ్దిదారులకు ఇస్తున్న కాంట్రాక్ట్* *9. ఇంటికి రోడ్డు మీద ఉన్న ఇంకుడు గుంత కు కనెక్షన్ కోసం ఇస్తున్న పివిసి పైపు కేవలం అడుగు పైపు, ఒక బెండు,* *10.కొద్ది లబ్ధిదారులకు రెండే రెండు రింగులు ఇచ్చి మూడో రింగ్ ఇస్తామని చెప్పి రెండు రింగులతోనే పూడ్చిన ఘనులు, మిగిలిన పైపు ఎవరిస్తారు. నిలదీస్తే ఇస్తారు లేదంటే గోవిందా?* *11. మూడు సిమెంటు రంగులకు మూడు అడుగుల వ్యాసం తో మూడు అడుగుల ఎత్తు కు కనీసం ట్రాక్టర్ గుండ్రాల్లు అవసరం అవుతాయి. కానీ కాంట్రాక్టర్ బృందం ఒకే ట్రిప్పును మూడు చోట్లకు సర్ది సగం సగం గుంతలు పూడ్చి కూలితే యమపురికి దారులు నిర్మిస్తున్నారు.* *12. కాలనీల్లో ఉన్న 20 అడుగుల రోడ్డు లో ఇప్పటికీ డ్రైనేజీ కాలువల కోసం వదిలితే 16 అడుగుల్లో ఇంకుడు గుంత కు 12 అడుగులు వేసుకుంటే రోడ్డు మీద ప్రయాణం చేసే అవకాశం ఉంటుందా చూడాలి.* *తక్షణం జగనన్న కాలనీల్లో ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని జిల్లా ఉన్న స్థాయి ఇంజనీర్లుతో కమిటీ వేసి విచారణ జరపాలి.* *నిధులు వృదా కాకుండా కాలనీల్లో డ్రైనేజీ కాలువలు వేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.* *మౌళిక సదుపాయాలపై దృష్టి పెట్టి చేయాలి. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సి. నాగేంద్ర. బి. హరికృష్ణ, నెట్టికంటయ్య, సంజీవరెడ్డి, పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.*

Anantapur

Oct 12 2023, 17:22

ఎస్కేయూ నందు యం. ఏ అడల్ట్ ఎడ్యుకేషన్ విభాగం నందు ప్రవేశాలు కొనసాగించాలని విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు ప్రారంభం..
ఎస్కేయు నందు విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ వర్సిటీ అధికారులు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారని విభాగాలను రద్దు చేసుకుంటూ పోతున్న వర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఇప్పటికైనా మార్చుకొని యధావిధిగా ప్రవేశాలు నిర్వహించి మరియు రేస్లైజేషన్ పేరుతో విభాగాలు రద్దు చేయడం ఉన్న అధ్యాపకుల పోస్టులను ఇతర విభాగాలకు బదిలీ చేయడని ఆపాలి వర్సిటీ అధికారులు ప్రవేశాలను జరిపేంతవరకు ఈ దీక్షలో కొనసాగుతాయంటూ విద్యార్థి నాయకులు తెలియజేశారు ఈ దీక్షకు రాష్ట్ర యూనివర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకుల రాష్ట్ర నాయకులు నరసింహారెడ్డి మద్దతిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్య మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి రాష్ట్ర యూనివర్సిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆలోచనలతో ముందుకు పోవడాన్ని ఆయన ఖండించడం జరిగింది అదేవిధంగా ఈ దీక్షకు ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు మురళి, మంజునాథ్ జిల్లా విద్యార్థి నాయకుడు బండారు శంకర్ మద్దతు ఇవ్వడం జరిగింది వారు మాట్లాడుతూ వర్సిటీ అధికారులు ప్రవేశాలను కొనసాగించేంతవరకు మా మద్దతు ఉంటుందని తెలియజేశారు* *నిరాహార దీక్షలకు చేస్తున్న వ్యక్తులు డాక్టర్ .ప్రతాప్ , డాక్టర్ .తిప్పే స్వామి ఐసా యూనివర్సిటీ కార్యదర్శి రాజు నాయక్, వైస్ ప్రెసిడెంట్ వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు డాక్టర్. అంకన్న, డాక్టర్. కల్లప్ప ఐసా రాష్ట్ర అధ్యక్షులు వేమన , ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ కార్యదర్శి రజినీకాంత్ ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ లీడర్ గిరి మరియు సుధీర్, రామ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

Oct 12 2023, 08:08

రైతులను నట్టేట ముంచిన వైయస్సార్ ప్రభుత్వం : తెలుగుయువతరాష్ట్రఅధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు...
శింగనమల : తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు మాట్లాడుతూ... రైతులకు 9 గంటల కరెంటు ఇస్తామని ప్రలోభాలు పలికిన ప్రభుత్వం ఈరోజు కనీసం 4 గంటలు కూడా కరెంటు ఇవ్వలేని దుర్మార్గ పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఏమనాలి ముందు చూపులేని ముఖ్యమంత్రి అనాలా?? అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు 9 గంటల నాణ్యమైన కరెంట్ అందించి వారి కష్టాలను కడతేర్చారు అన్నారు... రైతులు వర్షాలు లేక కరువుతో తీవ్ర దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ వైయస్సార్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బోర్లలో నీళ్లు ఉండి తడి చేసుకుందామని రైతుల ఆలోచిస్తే ఈ ప్రభుత్వం కనీసం 4 గంటలు కూడా రైతులకు కరెంటు ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారు ఎన్నికల ముందు రైతులకు మీరు ఇచ్చిన మాట ప్రకారం పగటిపూట 9 గంటల కరెంటు ఇస్తామని చెప్పినారు ఆ మాట ప్రకారం నిలబడాలి 9 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలి ఇచ్చిన మాట ప్రకారం కరెంటు ఇవ్వలేక రైతులకు చేతులెత్తేసిన ప్రభుత్వం ఏదైనా వుందంటే ఒక్క వైయస్సార్ ప్రభుత్వమేనని చెప్పాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.

Anantapur

Oct 11 2023, 20:33

ఓటమి భయం తోనే సీఎం జగన్ రెడ్డి వ్యవస్థలను అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసారు.... ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు..

తప్పుడు కేసులు, అసత్య ప్రచారాలు చేస్తూ, దేశం గర్వించే నేత నారా చంద్రబాబు నాయుడు గారిని జైలులో పెట్టాలనే కక్ష్య తప్ప...ఆయన అరెస్టుకు ఎలాంటి కారణాలు, ఆధారాలు లేవు. లక్షకోట్ల రూపాయలు అవినీతితో ఆనాడే ఉమ్మడి రాష్ట్రాన్ని దోచేసి 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి జగన్ రెడ్డి అని అరాచక విధానాలను సామాన్య ప్రజలు కూడా ముక్తకంఠం తో వ్యతిరేకిస్తున్నరని అన్నారు.నార్పల మండలం నిలువురాయి గ్రామం లో *బాబుతో -నేను*,, *మరియు ప్రజా వేదిక- రచ్చబండ* కార్యక్రమం లో *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు* ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించి అక్రమ అరెస్ట్ గురించి తెలియజేసారు.ఈ కార్యక్రమం లో *జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు గారు* పాల్గొన్నారు.ఈ సందర్బంగా *ఆలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ ఏనాడు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనని వారు సైతం చంద్రబాబు గారికి బాసటగా నిలుస్తున్నారన్నారు. జగన్ రెడ్డి దుష్టపాలనను అంతమొందించాలని, చంద్రబాబు గారు చల్లని పాలన తిరిగి రాష్ట్రానికి అవసరమని అందరూ భావిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి విషకౌగిలి నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబు గారిని అన్యాయంగా, జైల్లో పెట్టించి, తద్వారా జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ధ్వజమెత్తారు.అవినీతి బురదలో నిండా మునిగిన జగన్ ఆ బురదను అందరికీ అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అని తెలియజేసారు. ఎన్నికలు సమీపిస్తున్న వేల చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం జగన్ నియంత్రుత్వ పోకడలకు నిదర్శనం అన్నారు. ప్రజల మధ్యన వుండి ప్రజాసమస్యల గురుంచి మాట్లాడే చంద్రబాబు గారిని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేసారు. బాబుగారి అరెస్టును జీర్ణించుకోలేక జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు, బుత్ ఇంచార్జ్ లు,గ్రామ కమిటి అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు చామూలూరు, నిలువురాయి టీడీపీ గ్రామ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు

Anantapur

Oct 11 2023, 19:47

మరణించిన కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్ వారి భార్య దీపికాకు అడిషనల్ కార్పస్ ఫండ్ కింద 50 వేలు రూ.ల చెక్కును పంపిణీ చేసిన కమాడెంట్ గంగాధర రావు I.P.S
అనంతపురం జంతలూరు 14వ బెటాలియన్ లో పని చేస్తూ మరణించిన కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్ PC 760 వారి భార్య దీపికా కు అడిషనల్ కార్పస్ ఫండ్ కింద 50 వేలు రూపాయల చెక్కును కమాడెంట్ గంగాధర రావు ఐ.పి.యస్ చేతుల మీదుగా అందించటం జరిగింది ఇంకా వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ మరియు కారుణ్య నియామకం కింద జాబ్ తొందరగా వచ్చేటట్లు చూస్తాము అని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ AO విజయ్ కుమార్, పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య పాల్గొనడం జరిగింది.

Anantapur

Oct 11 2023, 19:13

పేదలపైవిద్యుత్ భారాలు తగ్గించాలి స్మార్ట్ మీటర్లునిలిపివేయాలి.. డి.చిన్నప్పయాదవ్ సీపీఐ..
జీల్లాకౌన్సిల్ మెంబర్ వామపక్షాల పిలుపుమేరకు కల్లుమడీ గ్రామములో సీపీఐ అద్వర్యంలో విద్యుత్ బిల్లులు తగ్గించాలని కరపత్రాలు విడుధలచేసి కరపత్రాలుపంఫీణీ డి.చిన్నప్పయాదవ్ ,సీపీఐ మండలకార్యదర్శి టి.రామాంజినేయిలు అద్వర్యంలో పంఫీణీచేయడమైనది. ఈ సంధర్బంగా డి.చిన్నప్పయాదవ్ మాట్లాడుతూ, శీతాకాలము వచ్చీనా వేసవి తలపించే గృహ విద్యుత్ బిల్లుభారీగా వస్తున్నాయి ప్రతినెల చార్జీలు విపరీతంగాపెంచి కేంద్రరాష్టప్రభుత్వాలుసామాన్యులపై పెనుభారము మోపుతున్నారు,కావున తక్షణమే పెంచినచార్జీలు తగ్గించాలి, 2000 సంవత్సరంలో వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడారు. ముగ్గురు కార్యకర్తలు ప్రాణాలర్పించారు. ప్రజలు తిరస్కరించిన ప్రపంచ బ్యాంకు సంస్కరణలను నేడు కేంద్ర ప్రభుత్వం పేరుతో రాష్ట్ర సర్కార్ అమలు చేస్తోంది. భవిష్యత్తులో విద్యుత్ రంగం పూర్తిగా కార్పొరేట్ల కబంధహస్తాల్లోకి వెళుతున్నది. చార్జీలు మరింతగా భారం కానున్నాయి. తక్షణం విద్యుత్ భారాలు తగ్గించాలి. స్మార్ట్ మీటర్లు ఆపాలి. ప్రమాదకరమైన విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాలి . ప్రైవేటీకరణ ఆపాలి. విద్యుత్ చట్ట సవరణ ఉ పసంహరించుకోవాలి. ప్రజలందరూ చార్జీల భారం తగ్గింపు కొరకు, ప్రమాదకరమైన కార్పొరేటీకరణ విధానాలు రద్దుచేయాలి కోర్కెలు: విద్యుత్ బిల్లులు తగ్గించాలి. ట్రూ అప్, సర్దుబాటు చార్జీలు ఇతర భారాలు రద్దు చేయాలి. గతంలో వాడుకున్న కరెంటుకు తదుపరి భారం వేసే విధానాన్ని రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్ల బిగింపు నిలిపివేయాలి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగించాలి. ఎస్సీ, ఎస్టీ, వృత్తిదారులకు ఎక్కడ నివసిస్తున్నా 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్తు రాయితీని అందించాలి 200 యూనిట్లు లోపు వినియోగించే పేదలందరికీ ఉచిత విద్యుత్ అందించాలి. విద్యుత్ సవరణ బిల్లు - 2022ను ఉపసంహరించుకోవాలి. పాల్గోన్నవారు, రామసుబ్బారెడ్ది, సుంకన్న,చంద్రా,ప్రకాశ్,శ్రీనివాసఅచారి,నల్లప్ప,నాగరాజు,పెద్దక్క,లక్ష్మి,బార్గవి,నల్లమ్మ,తదితరులుపాల్గోనడమైనది.

Anantapur

Oct 11 2023, 19:08

యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి రాఘవేంద్ర ఫార్మసి కళాశాలపై చర్యలు తీసుకోవాలి... AISA PDSU NSUI..
రాఘవేంద్ర ఫార్మసి కళాశాల విద్యార్థులు కన్వీనర్ కోట కింద ప్రవేశం పొందడానికి వచ్చినటువంటి విద్యార్థులను అధిక ఫీజులతో వేధిస్తున్నారు* *ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాఘవేంద్ర ఫార్మసీ కళాశాల ముఖ దారం నందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కళాశాల యాజమాన్యంతో అక్రమంగా కట్టించుకునేటువంటి ఫీజులపై వాదించడం జరిగింది ఈ సందర్భంగా ఐసా రాష్ట్ర అధ్యక్షులు వేమన, పి డి ఎస్ యు ,జిల్లా కోశాధికారి బండారు శంకర్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు మంజునాథ్ మాట్లాడుతూ రాఘవేంద్ర ఫార్మసి కళాశాల నందు విద్యార్థుల చేత నిబంధనకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను నిర్బంధాలకు గురిచేసి ఏ విద్యార్థి అయితే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మేం కడుతున్నాము మరి అదనంగా ఎందుకు ఫీజులు కట్టాలి అని కళాశాల యాజమాన్యాన్ని విద్యార్థులు ప్రశ్నించినప్పుడు ఆ విద్యార్థులపై కళాశాల యాజమాన్యం బెదిరింపు ధోరణితో మాట్లాడి వాళ్లను వీడియో గ్రాఫ్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది దీనిని పూర్తిగా ఖండిస్తూ కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించినప్పుడు మీరు ఎవరికైనా చెప్పుకోండి యూనివర్సిటీ అధికారులకు చెప్పుకున్న మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మేము ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది కానీ యూనివర్సిటీ అధికారులు మాత్రం యాజమాన్యానికి కొమ్ము కాస్తూ ఫీజుల దోపిడీని అరికట్టాల్సినటువంటి అధికారులే ఇలా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో కుమ్మక్కై పేద విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను ఫీజుల రూపంలో వేధిస్తున్నారని వాపోయారు విద్యార్థులకు జగనన్న విద్యార్థులు ద్వారా వస్తున్న సొమ్ముతోపాటు ప్రతి విద్యార్థి చేత అడ్డదారిలో 15000 రూపాయల కట్టించుకుని విద్యార్థులకు రికార్డ్స్ ఇస్తున్నాం మరియు ఇతర సాకు చెబుతూ కళాశాల యాజమాన్యం మాట తిప్పేస్తుంది కాబట్టి ఈ కళాశాలపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఈ కార్యక్రమంలో ఐసా నాయకులు రాజు నాయక్ వంశీకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు

Anantapur

Oct 11 2023, 06:34

గూగుడు జంట దేవాలయాలల్లో, మసీదు లో,చర్చ్ లో ప్రత్యేక పూజలు చేసిన: అలం నరసా నాయుడు..
గూగుడు జంట దేవాలయాలల్లో, మసీదు లో,చర్చ్ లో ప్రత్యేక పూజలు చేసిన: అలం నరసా నాయుడు.. జగన్ రెడ్డి అక్రమ కేసులకు భయపడేది లేదు ప్రజాక్షేత్రంలో తెల్చుకుంటాం*.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పై అక్రమంగా కేసు పెట్టి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వేదిస్తున్నడంతో చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని చంద్రుడిగా బయటకు రావాలని నార్పల మండలం గూగుడు గ్రామంలో హిందూ,ముస్లిం జంట దేవాలయాలు కుళ్ళాయస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాలలో, మసీదు లలో,చర్చ్ లలో *రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారి* ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా lరాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు గారు మాట్లాడుతూ మచ్చలేని చంద్రుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు రావాలని జంట దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. వైయస్సార్సీపి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు పై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు ఈ సైకో ప్రభుత్వానికి త్వరలో ప్రజలు ఓటు రూపంలో బుద్ది చెబుతారు అని అన్నారు. విద్యుత్ బిల్లులు ధరలు పెంచేస్తూ సంక్షేమ పథకాలకు కోత విధిస్తూ నవ మోసాల ప్రభుత్వంగా పేరుగాంచిందని ధ్వజమెత్తారు. అభివృద్ధిని మరచిపోయి ప్రశ్నించే వారిని వేధించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేకత పెరగడంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు అన్న భయంతోనే చంద్రబాబు అరెస్టుకు వైఎస్సార్ పార్టీ కుట్ర పన్నారు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులకు భయపడేది లేదు ప్రజాక్షేత్రంలో టెల్చుకుంటాం అని అన్నారు. టిడిపి హయాంలో 6 లక్షల కోట్లు అవినీతి జరిగిందని అన్నారు కానీ ఈ నాలుగున్నర సంవత్సరంలో 60 రూపాయలు అవినీతిని కూడా నిరూపించుకొలేక పోయారు అని అన్నారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, మాజీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు బుత్ ఇంచార్జ్ లు, మండల సీనియర్ నాయకులు,మాజీ ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మాజీ సర్పంచ్ లు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Anantapur

Oct 11 2023, 06:22

నవరత్నల్లోని ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అమలు చేయడంలో దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవం సృష్టించారు.. ఎమ్యెల్యే..
ప్రతి సంక్షేమ పథకం అమలు ఒక విప్లవమే : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి* నవరత్నల్లోని ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అమలు చేయడంలో దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవం సృష్టించారని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామంలో ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాల లబ్దిని వారికి కేటాయించిన బుక్ లెట్ ద్వారా వివరించారు. స్థానికంగా సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో గ్రామాల్లోని అన్నీ వర్గాలకు మంచి జరిగిందన్నారు. మంచి జరిగితేనే రానున్న ఎన్నికల్లో జగనన్నకు మద్దతుగా నిలవాలని కోరారు. దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కొనియాడారు. ప్రజలకు అన్ని రకాలుగా మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి మరోసారి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, మండల నాయకులు, సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.